అంతర్జాతీయ పేదల దినోత్సవం June 28





🌐🙇🏻➖➖➖➖➖➖➖➖
* అంతర్జాతీయ పేదల దినోత్సవం..*
➖➖➖➖➖➖➖🌸🌸🍃
★ ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. పేదల జీవితాలు మాత్రం మారలేదు. వీరి పరిస్థితిలో ఏ మార్పు కానరాలేదు. చాలీ చాలని ఆదాయం, కూడు, గూడు వంటి ఇతరత్రా సమస్యలతో జీవితాలను వెల్లదీస్తున్నారు.

★ కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ తదితర వసతులను పొందలేని పరిస్థితిని పేదరికం అనవచ్చు.

■ మనిషి తీసుకునే పౌష్టికాహారం ఆధారంగా పేదరికాన్ని గుర్తించవచ్చు. రోజుకు 2,250 కేలరీల ఆహారాన్ని తీసుకోని వారిని పేదలుగా ప్రభుత్వం గుర్తించింది. పౌష్టికాహారం అందని వారిని పేదలుగా గుర్తించినట్లయితే మన దేశంలో కోట్లాది మంది పేదలు ఉన్నట్లు నిర్ధారించవచ్చు.

■ ఎన్ఎస్ఎస్‌వో పేదరికపు అంచనాల
ప్రకారం 2011-12లో మొత్తం జనాభాలో 21.9 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఇందులో గ్రామీణ పేదల శాతం 25.7, పట్టణ పేదల శాతం 13.7.

■ కామన్వెల్త్‌ కామన్‌ హంగర్‌ అనే సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సరైన తిండి, పౌష్టికాహారం లభించని కారణంగా బరువు తక్కువగా పుడుతున్న పిల్లల్లో అత్యధిక శాతం భారత్‌లోనే ఉన్నారని తేలింది.దేశంలోని పిల్లల్లో 43శాతం బరువు తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.





■ 5సంత్సరాల లోపు పిల్లలు 7కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని సేవ్‌ చిల్డ్రన్‌ అనే సంస్థ నివేదిక ద్వారా తెలుస్తుంది. ఆకలితో అలమటించే వారు అత్యధికంగా ఉన్న ప్రపంచంలోని 88 దేశాలలో మన దేశానిది 66వ స్థానం. అయితే ప్రభుత్వాలు వీటికి సమ్మతించకుండా దేశంలో పిల్లలందరికీ వివిధ పథకాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని సొంత డబ్బాలు కొడుతున్నాయి.

■ పౌష్టికాహారం అందకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు అనేక సర్వేలు చెపుతున్నాయి. కాగా 2011లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) మన దేశంలో 53.7శాతం లేదా 61.2కోట్ల మంది పేదలు ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రకారం మన దేశంలోనే పేదలు ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే మన ప్రభుత్వాలు పేదరికాన్ని తక్కువగా చూపుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేయని వారు స్వంత భూమి, ద్విచక్రవాహనం, విద్యుత్‌ కనెక్షను లేనివారు పేదలుగా గుర్తింపబడు తున్నారు. తెలుపు రంగు రేషన్‌కార్డు ఉన్న వారు దారిద్య్రరేఖకు దిగువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తిస్తున్నా ఇప్పటికీ రేషన్‌కార్డు లేని వారు అనేక మంది ఉన్నారు.

■1947లో మన దేశానికి స్వాతత్య్రం వచ్చినపుడు దేశ జనాభా 34కోట్లు. అయితే ప్రస్తుతం మన దేశంలో పేదలు అప్పటి జనాభా కంటే ఎక్కువగానే ఉన్నట్టు ఓ సర్వే చెపుతుంది. మరో సర్వే ప్రకారం దేశంలో కోటీశ్వరుల సంఖ్య నానాటికీ పెరిగి పోతుండ గా పేదలు మాత్రం పేదలు గానే మిగిలి పోతున్నారన్న వాస్తవాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి.

◆ మన్‌కీ బాత్‌లో మాట్లాడిన  ప్రధాని మోదీ.. పేదల కడుపు నింపాలన్నదే తమ లక్ష్యమన్నా రు. కొంతమంది పెద్దలు పేదల కడుపు కొడుతున్నారని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

🌐





1 కామెంట్‌లు

కొత్తది పాతది