రమణుల వారి వివేక రత్నములు





రమణుల వారి వివేక రత్నములు
-----------------------------------------------------------------

సమాధి స్టితి ఎప్పుడు వస్తుంది ?

సమాధి స్టితి అంటే చుట్టు జరిగే విషయాల పట్ల ఎటువంటి ప్రతి చర్య చూపరాదు .శవాన్ని మనము ఎదైనా అడుగుతే ఏమి బదులు ఇవ్వదు కదా ! అలాగే చుట్టూ శబ్దాలు వున్నా ,ఎవరైన మాట్లాడుతున్నా ,వాసనలు వస్తున్నా ,ఆయా విషయాల పట్ల ఆసక్తిని కనపర్చరాదు .

ఒక విత్తనం మొలకెత్తాలి అంటే భుమి ,సూర్యరశ్మి ,గాలి ,తేమ ఎలా అవసరమో అలాగే పై నాలుగు పరిస్థితులు కల్పించినట్లయితే సమాధి దానంతట అదే జరిగిపోతుంది .

అలోచన అనేది మానసిక మట్టంలో సంభవించే సున్నితమైన మార్పు .మరియు అలజడి .ఇవి నిరంతరం వస్తునే ఉంటాయి .పుట్టిన దగ్గరనుండి చనిపోయే వరకూ కొనసాగుతూనే ఉంటాయి .అవి తగ్గిపోయే ప్రసక్తే లేదు .అలజడులు మూలంగా నిరంతరం మనసిక శక్తిని కోల్పోతూ ఉంటాము .అలోచన ఆగింది అంటే మానవజీవితం ఆగిపోయింది అని అర్థం .సమాధిలో వున్నప్పుడు అలోచన పరంపర పెరుగుతుంది .చెడు ఆలోచనను మనము వద్దు అనుకోవడం ,అణిచివేయడమో ,నొక్కిపట్టడమో ,పొడిగించడమో జరిగుతోంది . మంచి ఆలోచనని పొడిగించడమో ,సృష్టి చేయడమో చేయకూడదు .

అంటే మనము ఆలోచననకు శక్తినిస్తున్నాము .అందువల్ల శక్తి ఖర్చవుతుంది
అందువల్ల సమాధిలో ఉన్నపుడు ఏటివంటి అలోచన చేయకూడదు .దానిని వదిలివెయ్యాలి .అంగీకరించాలి .అనుమతించాలి కరిగించాలి ,విడుదల చేయాలి .బయటకి రానివ్వాలి .ఇదే సమాధియొక్క రహస్యము .ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆలోచనల వేగం తగ్గుతుంది .శక్తి ఖర్చు అయ్యే మార్గము మూసివేయబడింది .అప్పుడు మనసుకు లోతైన విశ్రాంతి లబిస్తుంది . అప్పుడు మాత్రమే సమాధి స్థితి కలుగుతుంది .

                                        హరే కృష్ణ --





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది