నీతికథ

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*✍✍✍నీతికథ✍✍*

*ఆ  రాజ్యంలో   రాజుగారు   చాలా  మంచి వాడు . ఆయన  ప్రతి  రోజూ   పేద  బ్రాహ్మణులకు  మద్యాహ్న  భోజనం  వండించి   పెట్టేవాడు.*
*ఒక  రోజు  యధావిధిగా   భోజనం   వండించే  ఏర్పాట్లు  చేస్తున్నాడు  .*  *అదే  సమయం  లో   ఆకాశం  లో  ఎగురుతున్న  ఒక  గద్ద  కాళ్ళతో  పట్టుకున్న  పాము  నోటినుండి  విషం  వడ్డించడానికి  సిద్ధంగా  ఉన్న   అన్నం  బేసిన్  లో  పడింది  .*  *అది  ఎవరూ  గమనించలేదు*
*ఆభాగం  ఒక  బ్రాహ్మణుడు  తిన్నాడు.*  *అది   తినడం  వలన    అతడు  చనిపోయాడు .  ఈ  వార్త  రాజుగారికి  చేరింది   .   ఆయన  చాలా   దుఃఖించాడు .   మేలు  చెయ్యబోతే   ఇలా  కీడు  జరిగింది  అని  ఆయన   చింతించాడు .*
.
.
*ఇప్పుడు  బ్రాహ్మణుడు  చనిపోవడానికి   కారణం  ఎవరు ?*

*రాజా ?   వంటవాడా ?    పామా ?  గద్దా  ? వడ్డించిన  వ్యక్తా ?*
.
*ఈ  పాపాన్ని  ఎవరి  ఖాతాలో  వెయ్యాలి ?*
.
.
*వీరిలో  ఎవరూ   కావాలని  ఆ  బ్రాహ్మణుడిని   చంపలేదు .*
.
.
*యమ  ధర్మరాజును  అడిగారు  .*
.
*ఇది  ఇలా  ఉంటె  మర్నాడు    దారినే  పోతున్న  బ్రాహ్మణులు  కొందరు   అన్నదానం  జరిగే  చోటును  చెప్పమని  ఒక  వనితను  అడిగారు .  ఆమె  వారికీ  దారిని  చూపుతూ* 
*“  బాబూ !   జాగ్రత్త  మా  రాజు  గారికి  బ్రాహ్మణులు  అంటే   పడదు  .  నిన్ననే  ఒకాయనను  విషం  పెట్టి  చంపేశారు”    .  మీ  రోజులు  బాగున్నాయో   లేదో  ?   అంది  .*
.
  *యమధర్మరాజు  గారు*
*“ చిత్రగుప్తా !    మొత్తం  పాపం  అంతా  ఈమె   ఖాతాలో  వెయ్యి .*
*యాదృచ్చికంగా    జరిగే   పనులకు   వ్యక్తులను  నిందించే  వారికి   ఆ  మొత్తం  కర్మ  ఫలం  కలుగుతుంది  అని  ధర్మం .”* *అన్నారు .*
.
*MORAL OF THE STORY ;*

*WHEN WE CRITICIZE OTHERS , WE TAKE UP THEIR KARMA .!!*

*BEAUTIFUL STORY FROM SRIMAD BHAGAVATA(ఈ నీతి కథ శ్రీమద్ భాగవతం నుండి గ్రహించబడింది)

🙏🙏🙏🙏👏👏👏👏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది