అచ్చంగా తెలుగు ప్రియమిత్రులందరికీ శుభోదయవందనములు .
శ్రీ తులసీ కృత హనుమాన్ చాలీసా --- మహిమా విశేషం.
చాలీసా అంటే నలుబది పద్యాల సంపుటి.. నలుబది మంత్రాల సమూహాన్ని మండలం అంటారు. వేదాలలో కొన్ని మంత్రాల సమూహాన్ని మండలం అంటారు. ఏదైనా ఒక
మంత్రోపాసనము ఫలించాలంటే నలుబది రోజులు అనుష్ఠానము చేయాలి.
హనుమాన్ చాలీసా ఒక సిద్ధ మంత్రము. అనగా పద్య ఫలిత మిచ్చునది.
" సి " అంటే ప్రకృతి లోని అన్ని శక్తులు మనలో ప్రవేశించి " ద్ధ " అనగా శరీరము లోని
అన్ని దుష్ట శక్తులు బయటకు పోవుట. అది ఒక బీజాక్షరములతో కూడిన మంత్రము.
హనుమాన్ చాలీసా పారాయణము నలుబది రోజులు చేయుటలో గొప్ప విశేషమున్నది.
హనుమాన్ చాలీసా లో శ్రీ ఆంజనేయ స్వామిని ప్రత్యక్షంగా ప్రశంసించు చౌపాయిలు
యిరువది నాలుగు. శ్రీరాముని మరియు సీతాదేవిని ప్రస్తావించు లేదా స్తుతించు
మరియు ఆంజనేయుని పరోక్షంగా పొగుడు చౌపాయిలు పదహారు. మొత్తము
కలిపి నలుబది.
హనుమాన్ చాలీసా నిర్మాణంలో శ్రీ తులసీ దాసు గారు ఎంతో జాగ్రత్త పడవలసి వచ్చినది.
హనుమాన్ చాలీసా శివుని ఆదేశానుసారము పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన ' వారణాసి ' నగరము లో వ్రాయబడినది. ఆంజనేయుడు పదకొండవ రుద్రుడు. అమిత శక్తి
మంతుడైన విష్ణువు ( రాముడు ) నకు సహాయార్ధం పదకొండవ రుద్రుడు మహా కపి
యైన హనుమంతుడి గా అవతరించాడు.
ఈ విధంగా హనుమాన్ చాలీసా పారాయణం వలన శ్రీరాముని స్తుతి మరియు
శ్రీ ఆంజనేయ స్వామి స్తుతి వలన కలుగు ఫలితములు రెండు లభించును.
ఒకవేళ ఎవరైనా హనుమాన్ చాలీసాను పారాయణం చేసినట్లయితే వెంటనే అతని భయం మటు మాయ మవుతుంది. హనుమాన్ చాలీసాను పూర్తి నమ్మకంతో పారాయణం చేసినట్లయితే హనుమంతుని అనుగ్రహం వలన మన బాధ లన్నీ దూరమవుతాయి.
చాలా కాలం నుండి నయం కాని మొండి వ్యాధులు కూడా నయమవుతాయి.
పాఠశాల, కళాశాల విద్యార్ధినీ , విద్యార్ధులు ప్రతి రోజు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే, వారందరికీ తగిన మేధా శక్తి, తెలివితేటలు హనుమంతుడు
ప్రసాదిస్తాడు. చెడు గ్రహముల ప్రభావము ఈ హనుమాన్ చాలీసా ను ప్రతి నిత్యము పారాయణము చేయు వారి మీద కన్పించదు.