ప్రద్యుమ్నే శృంఖలాదేవ

🌸🌸ప్రద్యుమ్నే శృంఖలాదేవి :🌸🌸

ఒక సాధువు ఆరాధ్యదైవముగా వెలసిన తారమాత, బెంగాలు నివాసులతోపాటు దేశంలోని వారందరికి ఆరాధ్య దైవమయింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమయింది. నమ్మినవారికి కొండంత శక్తిని ప్రసాదించే శక్తి స్వరూపిణి. ప్రతి నిత్యం యాత్రికులతో క్రిక్కిరిసి వుంటుంది. తారనది తీరంలో, కొంత ఎత్తైన ప్రదేశములో అమ్మవారి ఆలయం వుంది. బస్‌ హాల్ట్‌ నుంచి సుమారు అరకిలోమీటరు నడక ప్రయాణము చేయగా తారమాత దర్శనమిస్తుంది. ఆలయ రహదారి నిండా పూజా సామాగ్రీలు విక్రయించు షాపులు, పండాల నివాసములతో నిండి వుంటుంది. ఆలయం నందు పూజలు, హోమాలు మొదలగునవి పండాలు నిర్వహించుతారు. తారామాతకు భక్తులు భక్తిశ్రద్ధలతో పాలకోవా, మందారపువ్వులు మొదలగునవి సమర్పించుకుంటారు.

ఆలయము నందు అమ్మవారి స్వరూపం దేదీప్యమానంగా, తేజోవంతంఆ దర్శనమిస్తుంది. అమ్మవారి నాలుక బయటకు వచ్చి నోరంతా రక్తపుమరకలతో నిండి వుంటుంది. తారమాత నిజరూపం మరోవిధముగా వుంటుంది. నల్లటి రాతిమీద ఒక దృశ్యం కానవచ్చును. దానవులతో యుద్ధంచేసి శక్తిహీనుడైన పరమేశ్వరుడుని, శక్తిరూపిణియగు ఆదిశక్తి తన ఒడిలో పరుండపెట్టి చన్నుబాలు నిచ్చి తిరిగి శక్తివంతుడ్ని చేయు దృశ్యమును చూడగలము. తిరిగి రాత్రి 8 గంటలకు నిజరూప దర్శనము లభ్యమవుతుంది. భక్తులు అమ్మవారికి అభిషేకములు, కానుకలు మొదలగునవి సమర్పించుకుంటారు. పండాలు నిజరూప దృశ్య వివరణ భక్తులకు తెలియచేస్తారు. నిజరూప దర్శనాంతరము పండాలు అమ్మవారిని అలంకరించుతారు.

ఆలయ ప్రాంగణములో శివాలయం, గణపతి మందిరము, సాధువు మూర్తి విగ్రహం, వాసుదేవ మందిరము కలవు. అమ్మవారికి ఎదురుగా మూడు మండపములు కలవు. మొదటి మండపమునందు భక్తులు మాత తారను దర్శించుటకు, రెండవ మండపము నందు హోమం మొదలగునవి నిర్వహించుటకు, మూడవ మండపమునందు బలిపీఠమునకు సదుపాయములు కలవు. వీటితోపాటు పూజా సామాగ్రీలు విక్రయించుశాలలు కూడా కలవు. తారమాతను మొదటి మండపము నుంచి దర్శించుకుంటారు. నిజరూప దర్శన సమయము నందు అమ్మవారికి కుడివైపున గల ద్వారం నుంచి గర్భాలయములోనికి ప్రవేశము కల్పిస్తారు.

శంథియ రైలు జంక్షన్‌కు పశ్చిమవైపుగా సియూరి మీదగా అండల్‌ వరకు బ్రాంచి రైలు మార్గము కలదు. శంథియ రైలు జంక్ష్‌కు 19 కి.మీ. దూరమున సియూరి రైలు స్టేషన్‌ వస్తుంది. దీనికి పశ్చిమంవైపుగా, సుమారు 15 కి.మీ. దూరమున బక్రేశ్వర్‌ క్షేత్రం కలదు. ఇది శక్తి పీఠంగా ప్రసిద్ధి. సతీదేవి అమృత హృదయం పడిన ప్రదేశంగా ఖ్యాతి చెందినది. అహ్మద్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కూడా బస్సులో ప్రయాణము చేయవచ్చును. శంథియ రైల్వే జంక్షన్‌కు దక్షిణం వైపున 14 కి.మీ. దూరమున అహ్మదాపూర్‌ రైల్వే జంక్షన్‌ వస్తుంది. దీనికి పశ్చిమం వైపుగా బక్రేశ్వర్‌ క్షేత్రం కలదు.

బర్ధమాన్‌ జిల్లాలో రెండు శక్తిపీఠాలున్నాయి. మొదటి లాభపూర్‌ – ఖాట్వారోడ్‌ మార్గములో లాభపూర్‌కు 35 కి.మీ. దూరమున కేతుగ్రామ్‌ అను క్షేత్రం నందు కలదు. క్షేత్రంలోని శక్తిరూపమును దేవిబహులుగా పిలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో మూడవ పీఠముగా పరిగణించబడుతోంది. సతీదేవి ఎడమ భుజముపడినట్లుగా ప్రతీతి. ఆలయమునకు ఎదురుగా మండపము వుంది. పందాలు మండపము నందు హోమములు మొదలగునవి నిర్వహించుతారు. ఆలయమునకు మండపమునకు మధ్యన బలిపీఠం వుంది. విజయదశమి మొదలగు పర్వదినముల నందు అమ్మవారికి పశుబలి సమర్పించుకుంటారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది