నేడు అబ్దుల్ కలాం వర్ధంతి
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), భారత దేశపు ప్రముఖ క్షిపిణి శాస్త్రవేత్త మరియు భారత రత్న గ్రహిత, 11వ రాష్ట్రపతి.
అబ్దుల్ కలాం జూలై 27, 2015 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్లోని ఏఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం.. హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాంను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆయన గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు.
ఆయన వయస్సు 84 సంవత్సరాలు.భారత కీర్తి పతాక అబ్దుల్ కలాం అస్తమయం. చివరి క్షణాలు కూడా తనకి ఎంతో ఇష్టమైన విధ్యార్దులతో గడిపిన కలాం గారు ధన్యజీవి..అమర్ రహే అబ్దుల్ కలాంజీ ...........
Jai Hind..
Jai Hind...
Jai Kalam....