✊ ధూపం అంటే మరియు గొప్పతనం
మనసనాతన ధర్మము లో గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో
ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని మన పూర్వీకులు చెప్తున్నారు...
ఆదివారం :
ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే... ఆత్మబలం,
సిరిసంపదలు,
కీర్తి ప్రతిష్టలు,
ఈశ్వర అనుగ్రహం
లభిస్తుంది.
సోమవారం:
దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి.
మానసిక ప్రశాంతత..
అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
మంగళవారం:
శత్రుభయం,
ఈర్ష్య,
అసూయ,
తొలగిపోతాయి.
కంటి దృష్టిలోపాలుండవు.
అప్పుల బాధ తొలగిపోతుంది.
కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది.
బుధవారం :
నమ్మక ద్రోహం,
ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం,
పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది.
గురువారం:
గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా
గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి.
చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.
శుక్రవారం:
లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది.
శుభకార్యాలు చేకూరుతాయి.
అన్నింటా విజయాలుంటాయి.
శనివారం :
సోమరితనం తొలగిపోతుంది.
ఈతిబాధలుండవు.
శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు.
స్వస్తి..