*🌏 చరిత్రలో ఈరోజు 🌎*
*🌅జనవరి 16🌄*
*🏞సంఘటనలు🏞*
1967: గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
2010: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు.
*🌻🌻జననాలు🌻🌻*
1924: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు.ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. [మ. 2015]
1942: కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి
1946 : భారతీయ బుల్లితెర మరియు చలనచిత్ర నటుడు కబీర్ బేడి జననం.
*🌹🌹మరణాలు🌹🌹*
1901: మహాదేవ గోవింద రనడే, భారత జాతీయోద్యమ నాయకుడు.
1938: కోడి రామమూర్తి, ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందినవాడు.
1938 : ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ మరణం (జ.1876).
1943: త్రిపురనేని రామస్వామి, ప్రముఖ సంఘసంస్కర్త, కవిరాజు. (జ.1887)
1988: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (జ.1913)
2016: అనిల్ గంగూలీ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933)