చిత్తూరుజిల్లా ఏర్పాటు గురించి కొంత.





   చిత్తూరుజిల్లా ఏర్పాటు గురించి కొంత.


1. 4.1911లో చిత్తూరుజిల్లా ఏర్పడింది. అంతవరకు తమిళనాడులోని ఉత్తరఆర్కాటు జిల్లాలో చిత్తూరుప్రాంతం చేరి వుండేది.

అంతవరకు పలమనేరు చంద్రగిరి తాలూకాలు ఆర్కాటు జిల్లాలోనేవుండేవి, వాటిని తరువాత చిత్తూరు జిల్లాలో చేర్చడం జరిగింది.


మదనపల్లి వాయల్పాడు తాలూకాలను కడపజిల్లానుండి వేరుపరచి చిత్తూరులో కలపడం జరిగింది.


జమీందారీ ఏలుబడిలోవున్న పుంగనూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు ప్రాంతాలను కూడా తరువాత జిల్లాలో కలపడం జరిగింది.


ఉత్తరఅర్కాడులోని కంగుంది తాలూకాలోని 22 గ్రామాలు మినహ మిగితా ప్రాంతాన్ని పలమనేరు తాలూకాలో చేర్చడం జరిగింది.


1950 abserbation of Enelaves Order ప్రకారం మైసూరురాష్ట్రంలోని 20 గ్రామాలను కూడా ఇందులో కలపడం జరిగింది.


మద్రాసు ఆంధ్రప్రదేశ్ ల మధ్య రాష్త్ర సరిహద్దులపై వివాదంరాగా,1960లో  పతస్కర్‌ (Pataskar) కమిటి ఏర్పడింది. ఈ అవార్డు ప్రకారం చిత్తూరు జిల్లాకు పెద్దనష్టమే జరిగింది. భాష ప్రాతిపదికన తిరుత్తణి తాలూకాలోని తిరుత్తణి, ప్రొద్దుటూరిపేటల తోపాటు, వ్యాసాపురంలోని కొంతప్రాంతం  (282 గ్రామాలు) మద్రాసు రాష్ట్రానికి చేర్చడం జరిగింది.


ఇందుకు ప్రతిగా చెంగల్పట్టు జిల్లాలోని తిరువళ్ళూరు తాలూకాలోని 72 గ్రామాలను చిత్తూరు జిల్లాలో చేర్చడం జరిగింది.

 ఈ 72 గ్రామాలతోపాటుగా తమిళనాడులోని పొన్నేరి తాలూకాలోని 17 గ్రామాలను, తిరుత్తణి తాలూకాలోని 19 గ్రామాలను తీసుకొని, పుత్తూరు తాలూకాలోని 17 గ్రామాలను కలిపి కొత్తగా సత్యవేడు తాలూకాను ఏర్పాటుచేయడం జరిగింది.


ఇంకా Pataskar order ప్రకారం చిత్తూరు తాలూకా లోని 21 గ్రామాలను ఉత్తర ఆర్కాటులోని వల్లజాపేట తాలూకాలోను, 

చిత్తూరు తాలూకాలోని మరో 8 గ్రామాలను మద్రాసురాష్ట్రంలోని గుడియాత్తంలోను, పలమనేరులోని కొంత అటవీప్రాంతాన్ని ఉత్తర ఆర్కాడులోని తిరుపత్తూరు తాలూకాలోనికి,

పుత్తూరు తాలూకాలోని గోపాలకృష్ణపురం గ్రామాన్ని చెంగల్పట్టు జిల్లాలో కలపటం జరిగింది.


1960లోనే  పలమనేరు తాలూకాలోని 220 గ్రామాలను, తమిళనాడులోని సేలం జిల్లాలోని  కృష్ణగిరి తాలూకాలోని  మూడు గ్రామాలను తీసుకొని కుప్పంను స్వతంత్ర ప్రతిపత్తిగల సబ్- తాలూకాగాను, చిత్తూరు తాలూకాలోని 145 గ్రామాలతో బంగారుపాలెంను స్వతంత్ర ప్రతిపత్తిగల సబ్- తాలూకాగాను ఏర్పాటుచేయడం జరిగింది.


1968లో కుప్పం తాలూకాను ఏర్పాటుచేయడం జరిగింది.

1969లో కాళహస్తి తాలూకా పేరును శ్రీకాళహస్తిగా మార్చడం జరిగింది.


1969 లో  జిల్లాలో మూడు రివెన్యూ డివిజన్లు ఉండేవి.

అవి 

చిత్తూరు

చంద్రగిరి

మదనపల్లి


చంద్రగిరి రెవెన్యూ డివిజన్లో చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి తాలూకాలు చేరి వుండేవి.


తదనంతర కాలంలో చంద్రగిరి రెవెన్యూడివిజన్ ను రద్దుచేసి తిరుపతికి మార్చడం జరిగింది.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది