హిందూ ధర్మం అయిన సనాతన ధర్మానికి సింధూర చిహ్న వర్ణము గా ఎందుకు ప్రసిద్ధి కాంచింది ?






హిందూ ధర్మం అయిన సనాతన ధర్మానికి సింధూర చిహ్న వర్ణము గా ఎందుకు ప్రసిద్ధి కాంచింది ?
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సింధూర వర్ణం త్యాగానికి చిహ్నం ఎందుకు అయ్యింది ?
మన సనాతన ధర్మం ఋషులు ద్వారా యోగంలో దర్శించిన సత్యాలు ఆధారంగా వివరించబడింది అని అందరికి తెలుసు.అనాది , సనాతనుడు, అనంతుడు , స్వర్ణుడు (బంగారు వర్ణం కలిగిన వాడు లేదా కలది , ఎందుకంటే పరమాత్మ లింగాలకి అతీతుడు) అందుకే అది పరాశక్తికి స్వర్ణ ముఖి లేదా కనక దుర్గ అని పేరు . పరమాత్మ వర్ణం పసుపు. పరమాత్మ పరిస్థితులకి అతీతంగా మోక్ష స్థితి లేదా స్వర్ణ స్థితి లోనే ఉండును. ---------------(1)
ఇక జీవాత్మ విషయానికి వస్తాము మానవులు అనేక ఆరాలు (క్షేత్రాలు) పరిస్థితులు పట్టి మారుస్తూ ఉంటారు. కానీ కామ్య కర్మలతో కూడి ఉన్న జీవాత్మ యొక్క క్షేత్ర వర్ణం రక్త వర్ణం లేదా ఎరుపు వర్ణం .--------------- (2)

(1) + (2) -----------> స్వర్ణం + రక్త వర్ణం = సింధూర వర్ణం

స్వర్ణ ముఖి అయిన పరమాత్మ యొక్క వర్ణనకు ఉపయోగ పాడే అక్షరాలూ కాబట్టి వాటిని వర్ణ మాల అన్నారు. అక్షర పరబ్రహ్మ యొక్క గుణము నుంచి తీసుకొన్నవి కాబట్టి వాటిని అక్షరాలు అన్నారు

యోగీశ్వరులు సాధన ద్వారా, కర్మలు ద్వారా , జ్ఞానము ద్వారా పరమాత్మను చేరుకొన్న జీవాత్మలు . పరమాత్మలో లయం అయ్యారు కాబట్టి వాళ్ళే పరమాత్మలు . జీవ బ్రహ్మైక్య స్థితిని పొందారు వాళ్ళు బ్రహ్మమును ఎరిగిన జీవులు .
యోగీశ్వరులు తాము జీవ బ్రహ్మైక్య స్థితిని పొంది ఉండి కూడా తమదైన మోక్ష స్థితి లేదా స్వర్ణ స్థితిలో ఉండక , వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని ఈ జాగత్తతో మాకు ఏమి పనిలేదు మేము మోక్ష స్థాయిని పొందాము , స్వవర్ణాన్ని పొందాము , స్వ స్వరూపాన్ని పొందాము అని ఆ స్థితిలో ఉండిపోరు . లోకం కొరకు బ్రహ్మ కర్మలు చేస్తూ ఉంటారు . భూలోకంలో సంన్యాసులుగా జన్మిస్తూ ఇతర మానవులుని బ్రహ్మము వైపుకు మార్గదర్శనం చేస్తూ ఉంటారు . జీవ బ్రహ్మైక్య స్థితిని పొంది బ్రహ్మ కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళ కర్మలు కూడా పరమాత్మ దృష్ట్యా కామ్య కార్మికులే, కాకపోతే వీళ్ళ కర్మలు సాధారణ మానవులులాగా భవ బంధాల్లో ఇరుక్కునేటట్టు ఉండవు . పరమాత్మ స్థితిని పొందికూడా జీవాత్మ స్థితిలో కర్మ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆరాలో కొంచం బంగారు వర్ణం (పసుపు వర్ణం) + కొంచం రక్త వర్ణం (ఎరుపు వర్ణం) కలిపితే సింధూర వర్ణం . సింధూర వర్ణ క్షేత్రం పొందిన త్యాగుల ద్వారా ఏర్పరచిన జీవన విధానం కాబట్టి మనకు సింధూర వర్ణం ఆదర్శం ఐనది . అందుకే సంన్యాసులు సింధూర వర్ణం వస్త్రాలు ధరించాలి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది