రావణుడు చనిపోతూ లక్ష్మణుడి చెవిలో చెప్పిన రహస్యాలు..!
రామాయణం ముగిసేది రావణ సంహారంతోనే అని అందరికి తెలుసు కానీ రావణుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు రాముడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో…. బ్రాహ్మణులలోని పండితులలో ఒకడైన రావణుడి దగ్గరికి వెళ్లి నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడు. అన్న మాటను ఎప్పుడు గౌరవించే లక్ష్మణుడు రావణుని దగ్గరికి వెళ్ళగానే రావణుడు ఇలా చెబుతాడని చరిత్ర తెలియజేస్తోంది.
⇒ మన రధసారధితో, కాపలావాడితో, వంట వాడితో, నీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగా మెలగాలి. వాళ్ళతో గాని శతృత్వం పెట్టుకుంటే, వారు ఎప్పుడైనా, ఎటునుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తియ్యడానికి కూడా వెనకాడరు. ⇒ నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకో కానీ నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు. ⇒ ఎప్పుడు విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు. ⇒ నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకు. ఎవరి వెనుక ఎంత భలం ఉందొ ఎవరికి తెలుసు. నేను హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాను. ⇒ రాజు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కానీ ఎప్పటికీ అత్యాశాపరుడై ఉండకూడదు. ⇒ దేవుడిని ప్రేమించ వచ్చు లేదా ద్వేషించ వచ్చు కానీ ఏదైనా కూడా అపారమైన దృఢ నిశ్చయంతో ఉండాలి. ⇒ ఇతరులకు, సైన్యానికి అవకాశం ఇచ్చి, రాజు అలసిపోకుండా పోరాడితేనే విజయం సొంతం అవుతుంది. ⇒ ఈ మాటలు లక్ష్మణుడికి చెబుతూ ప్రాణాలు వదిలాడు రావణుడు. ఆయన చెప్పిన మాటలు అప్పటి జీవితాలకే కాదు ఈ కాలంలో మన జీవితానికి వర్తిస్తాయి. ఈ విషయాలు రామాయణ గ్రంథంలో ఉన్నాయి, ఎంతో విలువైన మాటలు తన ప్రాణంపోతున్న రావణుడు ఆ సమయంలో చెబుతాడని అవి ఈ లోకానికి ఉపయోగపడుతాయనే రాముడు లక్ష్మణుడిని వెళ్లి తెలుసుకోమంటాడు.