ధర్మ. ప్రబోధం .... మృత్యు - ద్వారాలు

పుట్టిన. వానికి మరణం  తప్పదు
అది  ఎప్పుడో  ఒకప్పుడు ప్రతి  వారికి
తప్పక. వచ్చేదే . 
అయితే  హాయిగా జీవితాన్ని  గడిపేవారిలో
ప్రవేశించకూడని  ఆరు లక్షణాలు కనుక
ప్రవేశిస్తే  అతడు  సుఖశాంతోషాలకు 
దూరమవుతాడు  .  మృత్యువుకు దగ్గరతూ -
ఉంటాడు  అని మన పూర్వీకులు  పేర్కొన్నారు .

అతి  గర్వం . వాచకత్వం  .  త్యాగబుద్ది
లేకపోవడం  . అధిక కోపం  . తన పొట్టనింపుకోవడంలో  మాత్రమే  ఆసక్తి  .
మిత్రద్రోహం  అనే  ఆరు  అంశాలు  మృత్యు -
ద్వారాలుగా  పేర్కొనబడే  ..
వాడియైన. కత్తులవంటివి  ఇవి మానవుల
ఆయుర్దాయాన్ని తీవ్రంగా  ఛేదించివేస్తాయి .
అందుకే  మనవాళ్ళు ఈ. ఆరు ఆంశాల
విషయంలో  ఎంతో  జాగ్రత్తగా  వహించాలని
ప్రబోధించారు ...

అతి గర్వం వల్ల. రావణ హిరణ్యకశిపులు .
శిశుపాల పౌండ్రకవాసుదేవ. . ధుర్యోధనులు
ఇలా  ఎందరెందరో  తమ శక్తి యక్తులను
ఎక్కువగా అంచనా  వేసుకుంటూ
ఇతరులను తక్కువగా అంచనాచేసి  ప్రాణా -
పాయాన్ని కొనితెచ్చుకున్నారు ...

ఎక్కువగా తిన్నా అనవసరంగా  సందర్భానికి
మించి  ఏదేదో మాట్లాడినా ప్రాణాలమీదికి
వస్తూంది . అందువల్ల. ఆహార వ్యవహారాల్లో
పరిమితిని కలిగి ఉండాలి  . అని మన పెద్దలు
పేర్కొన్నారు .. అధిక కోపం వల్ల. యుక్తాయుక్త
విచక్షణను కోల్పోతారు  . తాము చనిపోవటానికి  ఇతరులను కూడ సిద్ధపడుతారు .. మిత్రద్రోహేచ పాతకమ్ ""
అని భగవద్గీతలో  కృష్ణ పరమాత్మ
పేర్కొన్న. రీతిలో మిత్రద్రోహులు పాప ఫలాను -
భవం కోసం   యమపురికి చేరుతారు 
అట్లే  స్వార్థపరులు  . త్యాగబుద్ది లేనివారు  .
కూడ ఆకృత్యాలను ఆచరించి మృత్యు -
ధ్వారాల్లో  ప్రవేశిస్తారు

అందువల్ల వాడియైన కత్తులనలే  ఆయుర్దాన్ని
కత్తిరంపవేసి  ఈ ఆరు మృత్యుద్వారాల
విషయంలో  జాగ్రత్త. వహించాలి ..

"అతిమనోతి వాదశ్చతథా -
త్యాగో నరధీప. !
క్రోధశ్చాత్మవిధిత్సా  చ
మిత్రద్రోహశ్చ. తాని షట్  !
ఏత.  ఏవాసయస్తీక్ణాః 
కృంతంత్యాయూంషి  దేహినాం 
ఏతాని  మానవాన్ ఘ్నంతి న. మృత్యుః
భద్రమస్తు  తే   !!

అని చెప్పబడినది ..
ప్రాణ . మాన.  ధనములకు . కీర్రి.  ప్రతిష్టలకు
భంగాన్ని కలిగించే అదిషడ్వర్గ. విషయంలో
జాగ్రత్తను . వహించగల సామర్థ్యాన్ని 
పొందుటకు  సత్సాంగాత్వాన్ని
ఏర్పరచుకుందాం .   ఈ మృత్యుద్వారాలలో
చిక్కుకోకుండా  ఉండటం  కోసం  అవసరమైన
శక్తి యుక్తులను  అలవరుచుకోనెందుకు
మహానీయుల. మార్గదర్షనాన్ని  స్వీకరిద్దాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది