పుట్టిన. వానికి మరణం తప్పదు
అది ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వారికి
తప్పక. వచ్చేదే .
అయితే హాయిగా జీవితాన్ని గడిపేవారిలో
ప్రవేశించకూడని ఆరు లక్షణాలు కనుక
ప్రవేశిస్తే అతడు సుఖశాంతోషాలకు
దూరమవుతాడు . మృత్యువుకు దగ్గరతూ -
ఉంటాడు అని మన పూర్వీకులు పేర్కొన్నారు .
అతి గర్వం . వాచకత్వం . త్యాగబుద్ది
లేకపోవడం . అధిక కోపం . తన పొట్టనింపుకోవడంలో మాత్రమే ఆసక్తి .
మిత్రద్రోహం అనే ఆరు అంశాలు మృత్యు -
ద్వారాలుగా పేర్కొనబడే ..
వాడియైన. కత్తులవంటివి ఇవి మానవుల
ఆయుర్దాయాన్ని తీవ్రంగా ఛేదించివేస్తాయి .
అందుకే మనవాళ్ళు ఈ. ఆరు ఆంశాల
విషయంలో ఎంతో జాగ్రత్తగా వహించాలని
ప్రబోధించారు ...
అతి గర్వం వల్ల. రావణ హిరణ్యకశిపులు .
శిశుపాల పౌండ్రకవాసుదేవ. . ధుర్యోధనులు
ఇలా ఎందరెందరో తమ శక్తి యక్తులను
ఎక్కువగా అంచనా వేసుకుంటూ
ఇతరులను తక్కువగా అంచనాచేసి ప్రాణా -
పాయాన్ని కొనితెచ్చుకున్నారు ...
ఎక్కువగా తిన్నా అనవసరంగా సందర్భానికి
మించి ఏదేదో మాట్లాడినా ప్రాణాలమీదికి
వస్తూంది . అందువల్ల. ఆహార వ్యవహారాల్లో
పరిమితిని కలిగి ఉండాలి . అని మన పెద్దలు
పేర్కొన్నారు .. అధిక కోపం వల్ల. యుక్తాయుక్త
విచక్షణను కోల్పోతారు . తాము చనిపోవటానికి ఇతరులను కూడ సిద్ధపడుతారు .. మిత్రద్రోహేచ పాతకమ్ ""
అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ
పేర్కొన్న. రీతిలో మిత్రద్రోహులు పాప ఫలాను -
భవం కోసం యమపురికి చేరుతారు
అట్లే స్వార్థపరులు . త్యాగబుద్ది లేనివారు .
కూడ ఆకృత్యాలను ఆచరించి మృత్యు -
ధ్వారాల్లో ప్రవేశిస్తారు
అందువల్ల వాడియైన కత్తులనలే ఆయుర్దాన్ని
కత్తిరంపవేసి ఈ ఆరు మృత్యుద్వారాల
విషయంలో జాగ్రత్త. వహించాలి ..
"అతిమనోతి వాదశ్చతథా -
త్యాగో నరధీప. !
క్రోధశ్చాత్మవిధిత్సా చ
మిత్రద్రోహశ్చ. తాని షట్ !
ఏత. ఏవాసయస్తీక్ణాః
కృంతంత్యాయూంషి దేహినాం
ఏతాని మానవాన్ ఘ్నంతి న. మృత్యుః
భద్రమస్తు తే !!
అని చెప్పబడినది ..
ప్రాణ . మాన. ధనములకు . కీర్రి. ప్రతిష్టలకు
భంగాన్ని కలిగించే అదిషడ్వర్గ. విషయంలో
జాగ్రత్తను . వహించగల సామర్థ్యాన్ని
పొందుటకు సత్సాంగాత్వాన్ని
ఏర్పరచుకుందాం . ఈ మృత్యుద్వారాలలో
చిక్కుకోకుండా ఉండటం కోసం అవసరమైన
శక్తి యుక్తులను అలవరుచుకోనెందుకు
మహానీయుల. మార్గదర్షనాన్ని స్వీకరిద్దాం