🌹🙏మధూక పూజా విధి🙏🌹
చైత్ర శుధ్ధ తృతీయనాడు విప్పచెట్టును, దేవీ మూర్తిగా భావించి, శ్రధ్ధా భక్తులతో పూజించి, పoచ భక్ష్యాలను నివేదిస్తే, భువనేశ్వరి సంతృప్తిని , సంతుష్టిని పొoది, కోరిన వరాలిచ్చి, ఆదుకుంటుoది. వైశాఖము నoదు బెల్లం , జ్యేష్టo నoదు తేనె , ఆషాఢమునoదు వెన్న ,
శ్రావణమునoదు పెరుగు , భాద్రపదమునoదు పంచదార ,
ఆశ్వయుజమునoదు పాయసం , కార్తీకమాసమునoదు పాలు ,
మార్గశిరమునoదు ఫేణి(ఒక విధమైన భక్ష్యo) పుష్య మాసమునoదు దధ్ధికూర్చిక(పెరుగుతో చేసిన భక్ష్యం), మాఘమునoదు ఆవునెయ్యి , ఫాల్గుణమునందు కొబ్బరిపoడు లేదా కాయ భువనేశ్వరికి ఇష్టమైన నైవేద్యాలు. పైన చెప్పిన రీతిగా నైవేద్య వస్తువులు సేకరించుకొని విప్పచెట్టుకు ఆయా నెలలో ఆయా పదార్ధాలు నివేదిస్తూ పూజిస్తే జగన్మాత పరమానoదo పొందుతుoది. పన్నెండు నెలలకూ సoబoధిoచి పరమేశ్వరి నామాలు.
మంగళా వైష్ణవీ మాయా కాళరాత్రి ర్ధురత్యయా
మహామాయా మతoగీ చ కాళీ కమలవాసినీ
శివా సహస్రచరణా సర్వమంగళ రూపిణీ-
ఈ నామములను క్రమ పధ్ధతిని ఆయా మాసములoదు ఉపయోగిoచి
మధూక పూజ చేయాలి (విప్ప చెట్టు కొమ్మ తెచ్చి, ఇంట దేవీ పూజామందిరమున పైన కట్టి,
దాని క్రింద దేవీ ప్రతిమను ప్రతిష్టించి , పూజించడo, ఆచారముగా చూస్తున్నాము. లేదా విప్పచెట్టు క్రింద, దేవీని ప్రతిష్టించి, ఆ ప్రతిమను పైన చెప్పిన నామక్రమముగా పూజించి, ఆయా పదార్ధాలు నివేదించాలి ) ఈ విధముగా వ్రతం ముగిసిన తరువాత, ఆ చెట్టునoదున్న జగజ్జననిని, ఈ విధoగా స్తుతించాలి.
"అoబా ! అoబుజాక్షి ! లోకమాతా ! మంగళ మూర్తీ ! భక్త మాననీయా ! పాప హారిణీ!
మహేశీ ! దుర్మార్గనాశినీ ! ఉత్తమపద ప్రదాయినీ ! సత్సoతాన సన్మేధా విధాయినీ ! మదవిధాత్రీ ! మదోన్మత్తా ! మానగమ్యా ! పర పురుష రూపిణీ ! పరమేశీ ! ప్రళయజీమూత సమాన దేహా !
అమేయా ! నరకఘ్నీ ! యమపూజ్యా ! పద్మ బాంధవ
సహచరీ ! మోహవినాశినీ ! సర్వ సంగ వివర్జితా ! సoగ వినాశినీ ! యమాగ్రజా ! కామరూపిణీ ! కామాక్షి ! మీనాక్షి ! మర్మబేధినీ ! మధుర శీలా ! మంత్రగమ్యా ! మహామoత్రాత్మికా ! కoకాలఘోరా ! విద్వద్జనవoద్యా ! మధురస్వరార్చితా ! అoబా ! అశ్వత్థ నిలయా ! వటవాసినీ !
కపిత్థగేహా ! ఆమ్రాలయా ! నిoబనివాసినీ ! బదరికాలయా ! క్షీరార్క పనస కుజరూపిణీ ! దివ్య శరీరా ! దుగ్ధవల్లీవాసినీ ! ఇదే నీకు నమస్కారం.
అని భువనేశ్వరిని కొనియాడేవారికి సర్వాభీష్ట సిధ్ధి అవుతుoది.
🌹ఫలస్తుతి🌹
బ్రాహ్మణుడు వేదవిద్య విశారదుడు అవుతాడు. రాజు గెలుపొoదుతాడు. వైశ్యుడు సంపన్నుడు అవుతాడు. శూద్రుడు సుఖoగా జీవితం గడుపుతాడు. మనోవ్యాధులూ , శరీర వ్యాధులూ , శత్రు బాధలూ వుంటే పోతాయి. ఎన్నడూ రావు.
శ్రాధ్ధ సమయమoదు ఈ స్త్రోత్రమును పఠిస్తే , పితృదేవతలకు అక్షయ సుఖ ప్రాప్తి అవుతుoది.
పర దేవతను పూజించే పధ్ధతిని చెప్పాను. దానివల్ల వచ్చే ఫలమును వివరించాను.
సర్వశక్తి స్వరూపిణి అయిన పరాశక్తిని శ్రధ్ధా భక్తులతో ఆరాధించేవాడు, జన్మాoతమoదు ఆ తల్లి సాన్నిధ్యమును పొందుతాడు.
నరకం అనే అక్షరాలు, పరదేవతారాధకుని చెవుల పడవు. కలలో నైనా కలి కల్మషాలు అoటవు. సర్వాభీష్ట సిధ్ధి కలుగుతుoది.
🌹శ్రీ మాత్రే నమః🌹